VMRDA చేపడుతున్న పనుల ప్రగతిపై సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో చైర్మన్ శ్రీ ఎం.వి.ప్రణవ్ గోపాల్ మరియు మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ ఎన్ తేజ్ భరత్,IAS., ఇరువురు డివిజన్ల వారిగా సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా VMRDA చైర్మన్ శ్రీ ఎం.వి.ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ ఇప్పటికే పూర్తయిన లేఅవుట్లు స్థలాలను ఆక్షన్ ద్వారా విక్రయించి సంస్థకు ఆర్ధిక పరిపుష్టి చేకూరేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ఇంజనీర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని,అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని, నిర్దేశించిన కాలపరిమితిలోగా పనులను ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేసి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను కలసికట్టుగా చేరుకొని పురోగతిని సాధిద్దామన్నారు.
మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ తేజ్ భరత్, IAS., మాట్లాడుతూ బృహత్ ప్రణాళిక రహదారుల నిర్మాణంలో అడ్డంకిగా ఉన్న విద్యుత్ స్తంభాలను తరలించేందుకు సత్వరమే చర్యలు చేపట్టాలని, రహదారి విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న యజమానులకు TDR పంపిణీ చేసే విధంగా GVMC అధికారుల సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు. అదేసమయంలో సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రధాన ఇంజినీర్ శ్రీ వినయ్ కుమార్, కార్యదర్శి శ్రీ మురళీకృష్ణ, పర్యవేక్షక ఇంజనీర్లు భవానీ శంకర్, మధుసూదనరావు, కార్యనిర్వహక ఇంజనీర్లు, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ తేజ్ భరత్, IAS., మాట్లాడుతూ బృహత్ ప్రణాళిక రహదారుల నిర్మాణంలో అడ్డంకిగా ఉన్న విద్యుత్ స్తంభాలను తరలించేందుకు సత్వరమే చర్యలు చేపట్టాలని, రహదారి విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న యజమానులకు TDR పంపిణీ చేసే విధంగా GVMC అధికారుల సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు. అదేసమయంలో సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రధాన ఇంజినీర్ శ్రీ వినయ్ కుమార్, కార్యదర్శి శ్రీ మురళీకృష్ణ, పర్యవేక్షక ఇంజనీర్లు భవానీ శంకర్, మధుసూదనరావు, కార్యనిర్వహక ఇంజనీర్లు, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment