ప్రజా దర్బార్ కి వచ్చిన వినతుల పరిష్కారంలో అలసత్వం వద్దు * VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ , మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ తేజ్ భరత్
VMRDA లో ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కి వచ్చి అందజేసిన వినతుల పరిష్కారంలో అలసత్వం వహించవద్దని VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు ఆదేశించారు. సోమవారం ఉదయం VMRDA కార్యాలయం 3 వ అంతస్తు సమావేశమందిరంలో మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ N తేజ్ భరత్, IAS., గారితో కలిసి ప్రజా దర్బార్ లో పాల్గొని, ప్రజల నుంచి వినతులు అందుకున్నారు. ఫిర్యాదిదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రతి సమస్య గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వినతులను, ఫిర్యాదులను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ముందుగా ప్రతీ సమస్యకు సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు.
న్యాయ సంబంధిత సమస్యలను మినహాయించి, మిగిలిన వాటిని అన్ని పరిశీలించాలని కోరారు. వినతుల పరిష్కారంలో సిబ్బంది జవాబుదారీగా ఉండాలని ఆదేశించారు. ఈ ప్రజా దర్బార్ కి మొత్తం 10 వినతులు రాగా, వాటిలో పరిపాలన పరమైన వినతులు అత్యధికంగా 7 వరకు రావటంతో మరో మూడు మిగతా విభాగాలకు చెందిన వినతులు వచ్చాయి. 
న్యాయ సంబంధిత సమస్యలను మినహాయించి, మిగిలిన వాటిని అన్ని పరిశీలించాలని కోరారు. వినతుల పరిష్కారంలో సిబ్బంది జవాబుదారీగా ఉండాలని ఆదేశించారు. ఈ ప్రజా దర్బార్ కి మొత్తం 10 వినతులు రాగా, వాటిలో పరిపాలన పరమైన వినతులు అత్యధికంగా 7 వరకు రావటంతో మరో మూడు మిగతా విభాగాలకు చెందిన వినతులు వచ్చాయి. 
కార్యక్రమం లో జాయింట్ కమిషనర్ శ్రీ రమేష్, కార్యదర్శి శ్రీ మురళీ కృష్ణ, ప్రణాళికాధికారిణి శ్రీమతి శిల్పా, ఎస్టేట్ అధికారి దయానిధి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments
Post a Comment