Skip to main content

వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాసవియన్ సిద్ధ వెంకట సూర్య ప్రకాష్ రావు గారు మరియు ఇంటర్నేషనల్ సెక్రెటరీ (సర్వీసెస్) Vn. జూలూరి రమేష్ బాబు గారు తమ విశాఖపట్నం టూర్ లో భాగంగా ఈ రోజు విశాఖపట్నం పాత నగరంలో గల వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలనొర్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా దేవాలయంలో దేవాలయ సంఘ అధ్యక్షులు ఆరిశెట్టి దినకర్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిధి మాట్లాడుతూ 150 సంవత్సరాల చరిత్ర గల పురాతన ఆలయానికి విచ్చేసిన ఆనందం వ్యక్తపరుస్తూ ఆలయ పునర్నిర్మానికి ఆర్యవైశ్యులందరూ కలసి తమ సహాయ సహకారాలందించాలన్నారు.  దేవాలయ పునర్నిర్మాణానికి తన తరఫున నిర్మాణానికి కావలసిన గ్రానైట్ ను ఉచితంగా సరఫరా చేయుచున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో దేవాలయ సంఘ కార్యదర్శి పెనుగొండ కామరాజు మాట్లాడుతూ దేవాలయ చరిత్ర, పునర్నిర్మానం గావించవలసిన అవసరాన్ని వివరించారు.  

కార్యక్రమంలో దేవాలయ సంఘ కోశాధికారి దోమా వెంకట బాలాజి కుమార్, వాసవిక్లబ్ ఇంటర్నేషనల్ పూర్వపు అధ్యక్షులు ఏ.వి.ఎస్.ఎన్. గుప్త, పూర్వపు గవర్నర్స్  శ్రీయుతులు వేద మధుసూదన్, నల్లూరి నూకరాజు, కొల్లూరు సోమేశ్వరరావు, దింతకుర్తి నాగేశ్వరరావు, మొగల్లూరి రవికుమార్, మరియు దేవాలయ సంఘ పూర్వపు అధ్యక్షులు పెనుగొండ వెంకట చంద్రశేఖర రావు, 

మరియు అధిక సంఖ్య లో ఆర్యవైశ్యులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...