విశాఖపట్నం 20-03-2026 శుక్రవారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సారధ్యంలో జరుగుతున్న జనతా వారధి ప్రజలకు ప్రభుత్వానికి వారధి కార్యక్రమం లో భాగంగా బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు గారు జనతా వారధి ఉత్తరాంధ్ర కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు మాట్లాడుతూ ప్రజలకు ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలను అర్జీలను స్వీకరించి ఈ జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ జనతా వారధి కార్యాలయంలో ప్రతి శుక్రవారం ఒక MLA అందుబాటులో ఉంటూ ప్రజల నుండి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాడి పురుషోత్తం రమేష్, బీజేపీ జనతా వారధి కన్వీనర్ పొలిమేర శ్రీనివాస రావు, బీజేపీ జనతా వారధి కో కన్వీనర్ మూల వెంకటరావు, బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ T కోటేశ్వర రావుతో పాటు పలువురు నా...
జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 20.03.2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖ వైద్య ఆరోగ్య శాఖ ఆర్.సి.నెం.17716/మొబైల్ మెడికల్ యూనిట్/ ఎస్.హెచ్.టి.ఒ./2025 తేది. 22.02.2026 వారి ఆదేశానుసారం డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు విశాఖపట్నం జిల్లా కూ సంబందించిన పనిచేయని 104 సేవల యొక్క 20 పనికిరాని పాత వాహనములను ‘ఇ-కొనుగోలు’ పోర్టల్ వెబ్సైటు ద్వారా తేది 26.03.2026 ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు ఆన్లైన్ ద్వారా ఇ-వేలం ద్వారా విక్రయించుటకు నిర్ణయించారు. సదరు వేలం యొక్క నియమనిబందనలు మరియు మిగిలిన వివరములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి ఇ-వేలం పోర్టల్ https://konugolu.ap.gov.in నందు పొందుపరచబడినవి అని తెలియచేయడమైనది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి విశాఖపట్నం