విశాఖపట్నం :సందర్శన సందర్భంగా విశాఖపట్నం NCC/కోచింగ్ డిపోలో నూతనంగా అభివృద్ధి చేసిన వందే భారత్ భవనం మరియు సింహాద్రి భవనాలను శ్రీ లలిత్ బోహ్రా ప్రారంభించారు.వందే భారత్ భవనం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల నిర్వహణ మరియు మెయింటెనెన్స్కు సంబంధించిన పరిపాలనా కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా కేటాయించబడింది. అలాగే అధిక విలువ కలిగిన సామగ్రిని భద్రంగా నిల్వ చేసేందుకు అవసరమైన సౌకర్యాలు కూడా ఈ భవనంలో కల్పించారు.సింహాద్రి భవనం వాషింగ్ లైన్, C&W, CHG విభాగాల సూపర్వైజర్లు, సిబ్బందితో పాటు కోచింగ్ కార్యకలాపాలకు సంబంధించిన AC/TL మరియు ఆపరేటింగ్ విభాగాల సిబ్బంది పరిపాలనా కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా కేటాయించబడింది.ఈ నూతన సౌకర్యాల ద్వారా మెరుగైన, కేంద్రీకృత మరియు మరింత సమర్థవంతమైన పని వాతావరణం అందుబాటులోకి రానుంది. తద్వారా విశాఖపట్నంలో కోచింగ్ మెయింటెనెన్స్ కార్యకలాపాల సామర్థ్యం మరింత బలోపేతం కానుంది.




0 Comments