గల్లంతైన మత్స్యకారులను రక్షించిన పశ్చిమ బెంగాల్ వాసులను సన్మానించిన బిజెపి అల్లవరం మండల అధ్యక్షులు కట్టా నారాయణమూర్తి..

 

              SRINIVAS SPL Correspondant 
అల్లవరం, విశాఖ సందేసం.....అల్లవరం మండలంలో ఇటీవల ఓడలరేవు, కొమరగిరిపట్నం గ్రామాలకు  చెందిన మత్స్యకారులు వేటకు వెళ్లి గల్లంతైన విషయం తెలిసినదే .. ఆ గల్లంతైన మత్స్యకారులను మానవతా దృక్పథంతో కాపాడిన పశ్చిమబెంగాల్ వాసులు   బెoడమూర్లంక సెంటర్ కి రావడంతో ఆ పశ్చిమ బెంగాల్ వా
సులు   ముగ్గురిని  బిజెపి అల్లవరం మండలం తరపున ఘనంగా   సన్మానించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఆ ముగ్గురి యువకుల్లో ఒకరు పశ్చిమ బెంగాల్ బీజేపీ  మండల అధ్యక్షులుగా ఉండడం గమనార్హం... దేశ సేవలో అయినా మానవతా సేవలో అయినా ముందుండి నడిపించే వారిలో బిజెపి ముఖ్యపాత్ర ఉంటుందని ఈ సందర్భంగా నారాయణ మూర్తి  గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో SIR (సర్) కన్వీనర్ సంసాని రత్నకుమార్, (SIR) కో కన్వీనర్ పెద్దిరెడ్డి శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు వాసంశెట్టి దుర్గ వరప్రసాద్, బజరంగ్దళ్ నాయకులు పట్టా నాగరాజు, చిట్టూరి సత్యమధు, గంటా సత్తిబాబు, కోపనాతి శంకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments