సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఎంబీఏ అడ్మిషన్స్


విశాఖపట్నం, సెప్టెంబర్ 5, 2026:సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల (స్వయంప్రతిపత్తి), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) కోర్సును ప్రారంభించేందుకు అవసరమైన అనుమతిని పొందింది. అంతేకాకుండా, కళాశాల అధికారికంగా ఆన్‌లైన్ అడ్మిషన్ పోర్టల్‌లో నమోదు చేయబడిందని ప్రిన్సిపాల్ డా. సిస్టర్ షైజీ తెలిపారు. 

ఎంబీఏ ప్రవేశాలకు మొత్తం 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 42 సీట్లు ఆన్‌లైన్ అడ్మిషన్ల ద్వారా, 18 సీట్లు మేనేజ్‌మెంట్ కోటా ద్వారా భర్తీ చేయబడతాయి.

ఎంబీఏ చదివి మెరుగైన కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునే అర్హత కలిగిన విద్యార్థులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుని సెయింట్ జోసెఫ్ కళాశాలలో ప్రవేశం పొందాలని కళాశాల ఆహ్వానిస్తోంది.

Post a Comment

0 Comments