విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో

 


రాష్ట్ర మంత్రివర్యులు కింజరపు  అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ* 

రాష్ట్రంలో పనికిమాలిన రాజకీయ పార్టీ ఉంది.

ఆ రాజకీయ పార్టీ గొడ్డలి పార్టీ.

వాళ్ళు చెప్పిన ప్రతి మాట అబద్ధం.

ఏమరుపాటు జరిగి 2019 నటి ఫలితాలు మరల వస్తే చంద్రబాబు కు ,టీడీపీ కి నష్టం కాదు..

రాష్ట్రానికి పెద్ద నష్టం జరుగుతుంది.

జగన్ ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.

కూటమి పై బురద జల్లడం జగన్ కు అలవాటు అయిపోయింది.

జగన్ మాట లు కొంతమంది నమ్మితే నష్టం జరుగుతుంది కాబట్టి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం.

ప్రకృతి విపత్తు కంటే అతి పెద్ద విపత్తు గొడ్డలి పార్టీ.

జగన్ తన ఐదు సంవత్సరాలు పాలను గుర్తుపెట్టుకోకుండా మాట్లాడడం బాధగా ఉంది.

వర్షాభావ పరిస్థితులు ఐదు, ఆరు సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి.

వర్షభావ పరిస్థితులను ఎద్గురుకోవడానికి రిజర్వాయర్లు నిర్మిస్తారు.

గతంలో చంద్రబాబు 64 వేల కోట్లు రూపాయిలు ఒక్క ఇరిగేషన్ పైనే ఖర్చుపెట్టారు.

రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులను గాడిలో పెట్టాము.

రెండు సంవత్సరాలలో కొన్ని ప్రాజెక్టులు పూర్తి అవతాయన్న తరుణంలో జగన్ అధికారంలోకి వచ్చారు.

జగన్ ఒక్క జి ఓ తో ప్రాజెక్టులు ఆగిపోయాయి.

జగన్ రాయలసీమ కు చేసిన ద్రోహం స్వతంత్ర భారత దేశంలో జరగలేదు.

ఈ రెండున్నర సంవత్సరాలలో 13,500 కోట్లు ఖర్చు చేసి రాయలసీమ లో అన్ని ప్రాజెక్టులను గాడిలో పెట్టాము. 

జగన్ ఇరిగేషన్ ప్రాజెక్టులను నాసినం చేసి ఎల్ నినో కోసం మాట్లాడుతున్నారు.

జగన్ పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ఉంటే ఎల్ నినో లు ఎన్ని వచ్చినా రైతులకు ఇబ్బంది ఉండేది కాదు.

జగన్ పోలవరం ను గోదావరి లో కలిపేశారు.

గోదావరి పుష్కరాలు ముందు పోలవరం ప్రారంభించుకోబోతున్నాము.

సీఎం చంద్రబాబు వెలుగొండ ప్రోజెక్టు ను ప్రారంభిస్తున్నారు.

వచ్చే నెల మూడవ తేదీన ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకువస్తున్నారు.

ఎల్ నినో కంటే పెద్ద విపత్తు జగన్.

ఎల్ నినో పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.

రైతులను అప్రమత్తం చేసాము..ఏ పంటలు వేయాలో అవగాహన కల్పించాము.

పంటలు కోసం జగన్ కు ఎమ్ తెలుసు.

గతంలో సినిమా సెట్టింగులు, డ్రోన్ , రెడ్ కార్పెట్లు మధ్య జగన్ రైతులను పరామర్శించారు.

జగన్ శాసన సభ కు రావాలి.అసెంబ్లీ లో చర్చలో పాల్గొనాలి.

రైతులు పై ప్రేమ ఉంటే జగన్ అసెంబ్లీ కి వచ్చి మాట్లాడాలి.

పంటల బీమా అని పెట్టి రైతులను నట్టేట ముంచేశారు.

అసెంబ్లీ లో చంద్రబాబు పోడియం ముందు కూర్చుంటే ఒక్క సంవత్సరం భీమా కట్టారు.

వైసీపీ దుర్మార్గులు చేసిన మోసాలు తో రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది.

జగన్ ఒక్క సంవత్సరం అయిన రాభి కి భీమా కట్టారా.

2023 లో కరువు మండలలుగా ప్రకటించిన జగన్ రైతులకు ఒక్క పైసా ఇవ్వలేదు.

బుడమేరు విపత్తు వచ్చినప్పుడు వెనువెంటనే పరిహారం అందించాము.

రాజశేఖర్ రెడ్డి కి, జగన్ కి బలహీన వర్గాలు అంటే కసి.

బలహీన వర్గాలు టీడీపీ తో ఉంటున్నారని కక్ష పెంచుకున్నారు.

వైసీపీ ప్రభత్వంలో బలహీన వర్గాలు పై ధమనకండ కు దిగారు.

వైసీపీ ప్రభుత్వంలో నలుగురు సమంతా రాజులకు రాష్ట్రాన్ని అప్పగించారు.

జగన్ బీసీ లకు ఎం చేశారు.

జగన్ మాయ మాటలను ప్రజలు నమ్మరు.

చంద్రబాబు బీసీ లకు 34 శాతం రిజర్వేషన్ ఇస్తే జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారు.

54 కార్పొరేషన్ల ఏర్పాటు చేసిన వాళ్ళు కూర్చోవడానికి కుర్చీ ఇవ్వలేదు.

నేను బిసి మంత్రిగా చేసినప్పుడు చరిత్ర సృష్టించాము.

గతంలో బిసి లకు ఇవ్వడానికి పరికరాలు కొనిపెడితే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని పంచకుండా గోధములకే పరిమితం చేశారు.

జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ రిజర్వేషన్ ను 24 కు తగ్గించారు.

బీసీ లు రాజ్యాధికారం లో భాగస్వామ్యం కాకుండదని జగన్ రిజర్వేషన్ తగ్గించారు.

జగన్ చేసిన మోసం తో బీసీ లు అనేక అవకాశాలు కోల్పోయారు.

బీసీ లకు ఇచ్చిన రిజర్వేషన్ ను అడ్డుకోవడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు.

టీడీపీ పార్టీ నుంచి బీసీ లకు 34 శాతం కంటే ఒక శాతం ఎక్కువ ఇవ్వడానిక్ మేము సిద్ధంగా ఉన్నాము.

వైసీపీ ప్రభుత్వం లో గంజాయి కి సహకరించనవారికి ఉద్యోగాలు ఇచ్చారు.

వైసీపీ ప్రభుత్వం లో రాష్ట్రం గంజాయి కి అడ్డాగా ఉండేది.

రాష్ట్రాన్ని గంజాయి, మారకద్రవ్యాలు రహిత ఆంధ్ర ప్రదేశ్ గా 

మార్చలనే లక్ష్యం తో ముందుకు వెళ్తున్నాము.

ఎన్నికలు షాపీగా జరిగితే మేమే గెలుస్తామని 

జగన్ మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది.

వైసీపీ ప్రభుత్వ హయాంలో అబ్యర్ధులను  భయపెట్టి ఏకగ్రీవం చేసుకున్నారు.

2014 నుంచి 2019 వరకు రాష్ట్రానికి స్వర్ణ యుగం.

జగన్ ముద్దులు పెట్టి, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు.

జగన్ నోరు విప్పితే అబద్ధం.

గతంలో పార్టీకి ఒక్క సభ్యుడు ఉన్న సభ ను గడగడలడించారు.

గతంలో మాకు ఏంతో అవమాన పరిచిన చివరి వరకు ప్రజా సమస్యలు పై పోరాటం చేసాము.

జగన్ అసెంబ్లీ కి వస్తే గత ఐదు సంవత్సరాలు చేసింది బయట పెట్టి బట్టలు విప్పుతాము.

మతం మారాలని ఇబ్బందులు పెడితే కోడలు బయటకు వస్తే అది చంద్రబాబు పైనే నెడుతున్నారు.

టీడీపీ కి అన్ని మతాలపైన గౌరవం ఉంది.

జగన్ లాంటి మనుషులను మనం ఎక్కడ చూడము.

పెరుగుతున్న ధరలను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

తప్పు చేసిన వారిని వదిలేయాలా.

కనుమూరి నాగేశ్వరరావు చేసిన తప్పులు రికార్డెడ్ గా ఉన్నాయి.

మా ప్రభుత్వంలో కక్షలు లేవి..తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు.

చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి.

పదవులు ముఖ్యం కాదు..స్వేచ్చ ముఖ్యం.

మాకు సీఎం చంద్రబాబు దగ్గర స్వేచ్చ ఉంది..విలువ ఉంది.

రెడ్ బుక్ పని చేస్తే ఒక్కరైనా ఉంటారా.

ఓడలు రేవు బోటు ఘటన పై ప్రభుత్వం త్వరితగతిన స్పందించింది.

ఏడుగురు మత్య్సకారులు క్షేమంగా వచ్చారు.

మత్య్సకారులు వేటకు వెళ్లటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఎస్ ఓ పి సిద్ధం చేసాము.

మత్య్సకారులు వేటకు వెళ్ళేటప్పుడు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటాం.

 ఈ సమావేశంలో ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్  విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జ్  సీతం రాజు సుధాకర్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ, రాష్ట్ర పార్టీ కార్యనిర్వ కార్యదర్శి కోరాడ రాజబాబు, అనసూరిమధు, విల్లూరి భాస్కరరావు, వలిశెట్టి తాతాజీ,నక్కకనక రాజు, తదితరులు పాల్గొన్నారు,

Post a Comment

0 Comments