. SRINIVAS SPL Correspondent
అల్లవరం, విశాఖ సందేసం....అల్లవరం మండలం మొగళ్ళమూరు గ్రామపంచాయతీ పరిధిలోని సిరగట్లపల్లి వెళ్లే ప్రధాన రహదారి గుంతలు మయంగా మారి విద్యార్థులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయం బిజెపి అల్లవరం మండల అధ్యక్షులు కట్టా నారాయణమూర్తి దృష్టికి సమస్యను ప్రజలు తీసుకురాగా అల్లవరం ఎంపీడీవో గౌరీకుమారి కు వినతి పత్రం ద్వారా తీసుకువెళ్లడం జరిగింది . ఈ సందర్భంగా సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ఈ రోడ్డుపై వెళ్తున్న స్కూల్ బస్సులు చాలా ప్రమాదకర పరిస్థితిలో ప్రయాణిస్తున్నాయని తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, ఈ రహదారి పూర్తయ్యే లోపు ముందస్తు చర్యగా రోడ్డుపై హెచ్చుతగ్గులు లేకుండా గ్రావెల్స్ తో సరి చేయాల్సిందిగా ఎంపీడీవోకు విన్నవించడం జరిగిందన్నారు. సానుకూలంగా స్పందించిన ఎంపీడీవో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నల్ల రాము, కటికరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

0 Comments