ప్రధాని నరేంద్ర మోడీ గారి 76 వ జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ కొమర రవిరాజ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు పరశురామ రాజు గారు ప్రారంభించడం జరిగింది.

 


సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు పీ వీ న్ మాధవ్ గారికి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈరోజు ఉదయం విశాఖపట్నం అన్ని వార్డులలో విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగిందని దాంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి సుమారు పాతికవేల యూనిట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు.

 

అలాగే సాయంత్రం 7 గంటలకు దేవాలయాలు, వినాయక చవితి మండపాలలో, దేశ ప్రజల జీవితాలను తీర్చిదిద్దున మహనీయునికి కృతజ్ఞతా పూర్వక ఆశీర్వాదాలు తెలియజేయడ కొరకు ఆశీర్వాద దీపం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సుజాత రాజ్, రాష్ట్ర ఎస్టీ మోర్చా జనరల్ సెక్రెటరీ మురళీమోహన్ రాజు, జిల్లా మీడియా కన్వీనర్ కోటేశ్వరరావు తోపాటు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments